విశాఖ: విశాఖ రైల్వే జోన్ కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి ఉద్యమంలో పాల్గొనాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. అప్పుడు జగన్, చంద్రబాబుతో కలిసి రైళ్లను స్తంభింపజేసేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. విశాఖ జిల్లా తగరపువలసలో నిర్వహించిన బహిరంగసభలో ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రికి ప్రధాని మోదీ అంటే భయమని పవన్ అన్నారు. తనకు అలాంటి భయాలేవీ లేవని చెప్పారు. ప్రత్యేక హోదాపై తొలి నుంచీ కేంద్రంతో పోరాడుతోంది జనసేన పార్టీ మాత్రమేనని అన్నారు.
భూ నిర్వాసితులతో భేటీ..
రాష్ట్రంలో భూ నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి మహారాష్ట్ర రైతుల తరహా ఉద్యమం అవసరమని జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెల్లడించారు. విశాఖలో ఆంధ్రప్రదేశ్ భూ నిర్వాసితులతో సమావేశమైన ఆయన రైతుల బాధలు తెలిసిన వాడిగా వారి సమస్యల పరిష్కారానికి అండగా ఉంటానని తెలిపారు. ఆ మేరకు రాజధాని ప్రాంతంలోని ఉండవల్లి నుంచి ఉద్యమం ప్రారంభిస్తానని ప్రకటించారు. అమరావతి రాజధాని ప్రాంతం భూ నిర్వాసితులు, కాకినాడ సెజ్, పోలవరం ముంపు మండలాల్లోని రైతులు, పోలవరం ప్రాజెక్టు డంపింగ్ యార్డ్ బాధిత రైతులు, వంశధార నిర్వాసితులు, భోగాపురం గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయ నిర్వాసితులు, భావనపాడు పోర్టు బాధితులు, కొవ్వాడ అణువిద్యుత్ ప్రాంత రైతులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
No comments:
Post a Comment