Friday, July 6, 2018

నేటి నుంచి ‘నీట్‌’ వెబ్‌ఆప్షన్లు


నేటి నుంచి ‘నీట్‌’ వెబ్‌ఆప్షన్లు
ఈనాడు, హైదరాబాద్‌: తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్యకళాశాలల్లో కన్వీనర్‌ కోటాలో 2018-19 సంవత్సరానికి ఎంబీబీఎస్‌, బీడీఎస్‌ ప్రవేశాల్లో చేరికకు శనివారం నుంచి వెబ్‌ఆప్షన్లకు అవకాశం కల్పిస్తున్నట్లు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్‌ కరుణాకరరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. నీట్‌ ర్యాంకుల ప్రాతిపదికనే ప్రవేశ ప్రక్రియను నిర్వహించనున్నారు. ఒకటో ర్యాంకు నుంచి 5 వేల ర్యాంకుల వరకూ శనివారం(7న) ఉదయం 8 గంటల నుంచి 8వ తేదీ రాత్రి 11 గంటల వరకూ.. 5001వ ర్యాంకు నుంచి ఆఖరి ర్యాంకు వరకూ 8వ తేదీ ఉదయం 8 గంటల నుంచి 10న మధ్యాహ్నం 2గంటల వరకూ వెబ్‌ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. ర్యాంకులతో సంబంధం లేకుండా అర్హులైన అభ్యర్థులంతా 10న ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు వరకూ వెబ్‌ ఆప్షన్లలో మార్పులు చేసుకోవచ్చు. దివ్యాంగుల కోటా అభ్యరులు కూడా ఇవే తేదీల్లో తమ దరఖాస్తులను సమర్పించుకోవాల్సి ఉంటుందని ఉపకులపతి తెలిపారు. క్రీడా, ఎన్‌సీసీ, సైనిక తదితర కోటాలవారికి సంబంధిత అధికారుల నుంచి ప్రాధాన్యత జాబితా వచ్చిన అనంతరం విడిగా వెబ్‌ఆప్షన్లకు ప్రకటన విడుదల చేస్తామని పేర్కొన్నారు. సీటు పొందిన తర్వాత అభ్యర్థి కేటాయించిన కళాశాల/ కోర్సులో చేరకపోతే తదుపరి ప్రవేశ ప్రక్రియకు అనర్హుడిగా ప్రకటిస్తారని వివరించారు.
9 నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌
బీఈడీ కోర్సులో ప్రవేశానికి ఈనెల 9వ తేదీ నుంచి ఎడ్‌సెట్‌ కౌన్సెలింగ్‌ ప్రారంభం కానుంది. అదేరోజు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 12 సహాయ కేంద్రాల్లో ధ్రువపత్రాల పరిశీలన నిర్వహిస్తారు. పదో తేదీ నుంచి వెబ్‌ ఆప్షన్లు ఇచ్చుకోవచ్చు. కౌన్సెలింగ్‌ రుసుము కింద ఎస్‌సీ, ఎస్‌టీలు రూ.500, ఇతరులు రూ.800 చెల్లించాలి. ర్యాంకుల వారీగా ఏ రోజు, ఏ సమయానికి కౌన్సెలింగ్‌కు హాజరుకావాలి? సహాయ కేంద్రాలు, కళాశాల రుసుము తదితర పూర్తి వివరాలకు edcetadm.tsche.ac.in, edcet.tsche.ac.in వెబ్‌సైట్ల ద్వారా తెలుసుకోవచ్చని కన్వీనర్‌ ఆచార్య మధుమతి తెలిపారు.

No comments:

Post a Comment

WhatsApp Reportedly Issues Fix for Chat Syncing Issue With Linked Devices

WhatsApp is reportedly implementing a security fix to address the issue where a user's chats across devices were not synced properly. Th...