Friday, July 6, 2018

ఒక్క ట్వీట్‌.. 26 మంది బాలికలకు విముక్తి

ఒక్క ట్వీట్‌.. 26 మంది బాలికలకు విముక్తి 
     రైల్లో అక్రమంగా తరలిస్తున్నారని ప్రయాణికుడి ట్వీట్‌ 
                  కాపాడిన జీఆర్‌పీ, ఆర్‌పీఎఫ్‌


దిల్లీ: రైలులో అక్రమంగా తరలిస్తున్నట్లుగా భావిస్తున్న 26 మంది మైనర్‌ బాలికలకు.. ప్రభుత్వ రైల్వే పోలీసులు (జీఆర్‌పీ), రైల్వే పరిరక్షక దళం (ఆర్‌పీఎఫ్‌) విముక్తి కల్పించాయి. బాలికల తరలింపుపై ఓ ప్రయాణికుడు ట్విటర్‌ ద్వారా అప్రమత్తం చేయడంతో వారిని రక్షించాయి. ముజఫ్ఫర్‌పుర్‌ నుంచి బాంద్రాకు వెళ్తున్న అవధ్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ఈ బాలికలు ప్రయాణించారు. వారిని అక్రమంగా తరలిస్తుండవచ్చన్న సందేహంతో ఆదర్శ్‌ శ్రీవాస్తవ అనే వ్యక్తి గురువారం రైల్వేశాఖకు ట్వీట్‌ చేశారు. ‘‘దాదాపు 25 మంది బాలికలు ఇబ్బందిలో ఉన్నట్లుగా కనిపిస్తున్నారు. వారిలో కొందరు రోధిస్తున్నారు. ప్రస్తుతం రైలు హరినగర్‌ (ఉత్తర్‌ప్రదేశ్‌)లో ఉంది’’ అని పేర్కొన్నారు. దీనికి వారణాసి, లఖ్‌నవూల్లోని అధికారులు వెంటనే స్పందించారని.. అరగంటలోపే విచారణ చేపట్టారని రైల్వే అధికార ప్రతినిధి తెలిపారు. ఇద్దరు ఆర్‌పీఎఫ్‌ జవాన్లు సాధారణ ప్రయాణికుల్లా కప్తాన్‌గంజ్‌లో ఆ రైలు ఎక్కారని.. గోరఖ్‌పుర్‌ వరకు బాలికలకు రక్షణగా ఉన్నారని పేర్కొన్నారు. 10 నుంచి 14 ఏళ్ల మధ్య వయసు కలిగిన మొత్తం 26 మంది బాలికలను కాపాడమని.. వారి వెంట ఉన్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామని ఆర్‌పీఎఫ్‌ తెలిపింది. బాధిత బాలికలు బిహార్‌లోని చంపారన్‌కు చెందిన వారని, వారిని శిశు సంక్షేమ కమిటీకి అప్పగించామని తెలిపింది.

No comments:

Post a Comment

WhatsApp Reportedly Issues Fix for Chat Syncing Issue With Linked Devices

WhatsApp is reportedly implementing a security fix to address the issue where a user's chats across devices were not synced properly. Th...